
మొక్కలను పెంచుదాం
జాతీయ అటవీ విస్తీర్ణం ప్రకారం భూ విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. ఉమ్మడి జిల్లా వైశాల్యం 7956 చదరపు కిలోమీటర్లు కాగా, అడవులు మాత్రం 1196.29 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. ఇవి జిల్లా విస్తీర్ణంలో 23 శాతం మాత్రమే. సిరికొండ, ఇందల్వాయి, ఎల్లారెడ్డి, బాన్సువాడ అటవీ క్షేత్ర పరిధిలో గత పదేళ్లలో అడవుల విస్తీర్ణం బాగా తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏటా ఉమ్మడి జిల్లాలో అడవుల సంరక్షణ కోసం ‘కంపా’ పథకం కింద రూ. 4.20 కోట్లు కేటాయిస్తున్నా గత రెండేళ్లలో అడవుల విస్తీర్ణం 0.929 శాతం మాత్రమే పెరిగింది.