
విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం
పంట దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంతో భూసారం, పర్యావరణం దెబ్బతింటోంది. పచ్చని పొలాలపై పురుగుల మందులు ఎక్కువగా పిచికారీ చేస్తుండడంతో ప్రకృతి రీత్యా లభించే ఫలాలు విషతుల్యం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10.20 లక్షల సాగు విస్తీర్ణం ఉండగా, ఏటా 22.5 లక్షల లీటర్ల పురుగుల మందులు, 3.93 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వాడుతున్నారు. అతిగా ఎరువుల వాడకంతో భూసారం తగ్గడమే కాకుండా మిత్ర పురుగుల సంతతి నశించి కాలుష్యం పెరుగుతోంది. ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.
సేంద్రియమే సేఫ్