
సమగ్రాభివృద్ధి
నిజామాబాద్
సమ ప్రాధాన్యత
● లక్ష మంది రైతులు రుణాల నుంచి విముక్తులయ్యారు ● ధాన్యం సేకరణలో జిల్లాకు అగ్రస్థానం ● సాగు ప్రణాళిక సిద్ధం ● గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు ● ఆర్టీసీ బస్సులో 3.59 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం ● రూ.142.86 కోట్ల గృహజ్యోతి సబ్సిడీ ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
కార్పొరేషన్ కమిషనర్ దిలీప్..
సీపీ సాయిచైతన్య..
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్..
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న ఈరవత్రి అనిల్..
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
నేటి నుంచి
భూ భారతి సదస్సులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా నేటి (మంగళవారం) నుంచి భూ భారతి రెవె న్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ డివిజన్లో 14 బృందాలు, నిజామాబాద్ డివిజన్లో 19, ఆ ర్మూర్ డివిజన్లో 17 మ్తొతం 50 బృందాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తాయని పే ర్కొన్నారు. బృందాలు గ్రామాల్లో ప్రజలకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తా యని తెలిపారు.
జెడ్పీ కార్యాలయంలో జెండా
ఎగురవేసిన కలెక్టర్
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
11న యోగా వాక్
నిజామాబాద్నాగారం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ వరకు యోగా వాక్ నిర్వహించనున్నట్లు ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డా.జె.గంగదాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 4న సుభాష్నగర్లోని దయానంద యోగా కేంద్రంలో ఉదయం 10 గంటలకు యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 7981434641 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
‘డ్రోన్ మొబైల్
పెట్రోలింగ్’
ఖలీల్వాడి: కమిషనరేట్ పరిధిలో డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్ను టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సీపీ సాయిచైతన్య సోమవారం నగరంలోని పరేడ్ మైదానంలో ప్రారంభించారు. సున్నిత, రద్దీగా ఉండే ప్రాంతాల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోస్తున్నట్లు సీపీ తెలిపారు. డ్రోన్ల నుంచి వచ్చే ప్రత్యక్ష వీడియో ఫుటేజీ మొబైల్ పెట్రోలింగ్ యూనిట్లతో అనుసంధానమై ఉంటుంది, దీంతో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. పండగలు, ర్యాలీల సమయంలో జనం గుంపులపై పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షణ, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్లు దోహదపడతాయన్నారు.
నిజామాబాద్అర్బ న్: రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్ర జల ఆకాంక్షలకు అ నుగుణంగా.. గ్రా మీణ, పట్టణ, నగ ర ప్రాంతాలకు స మకు సమ ప్రాధా న్యతనిస్తూ సమగ్రాభివృద్ధి సాధిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చై ర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప రేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భా వ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ రై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమా లు, సాధించిన ప్రగతిని వివరించారు. అనిల్ ప్రసంగం సాగిందిలా..
నాలుగు విడతల్లో రుణమాఫీ
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ప్రభు త్వం దేశ వ్యవసాయరంగ చరిత్రలో నిలిచిపోయే లా రైతులకు రుణ మాఫీ పథకం అమలైంది. జిల్లా లో ఇప్పటి వరకు 4 విడతల్లో మొత్తం 1,00,612 మంది రైతులకు రూ.782.31 కోట్లు మాఫీ అయ్యింది. పెట్టుబడి సాయం పెంచి రైతుభరోసా కింద ఎకరానికి రూ.12వేల ఆర్థిక సాయం అందుతోంది.
ధాన్యం కొనుగోళ్లలో..
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 700 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,05,774 మంది రైతుల నుంచి రబీ సీజన్కు సంబంధించి 8,19,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు రూ.500 చొప్పున బోనస్ అందుతుంది.
భూ భారతి దరఖాస్తులు 706
భూ భారతి రెవెన్యూ సదస్సులు ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో కొనసాగుతాయి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మెండోర మండలంలో మే 5 నుంచి 8వ తేదీ వరకు సదస్సులు నిర్వహించగా 706 దరఖాస్తులు అందాయి. 369 పరిష్కరించదగినవి కాగా, విచారణ అనంతరం 72 దరఖాస్తులకు ఆమోదం లభించింది. 133 దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా, 104 విచారణలో ఉన్నాయి.
ఇందిరమ్మ ఇళ్లు
జిల్లాలో 19,490 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా, 16,286 ఇళ్లు లబ్ధిదారులకు మంజూరయ్యాయి. 4,177 ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ పూర్తికాగా, 430 బేస్మెంట్, 56 రూఫ్ లెవెల్ , 10 ఇళ్ల స్లాబ్ లెవెల్ పనులు పూర్తయ్యాయి. రూ.5.08 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
వ్యవసాయం
జిల్లాలో వానాకాలం సీజన్కు జిల్లా వ్యవసాయశాఖ 5.61 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే యూరియా 75,000 మెట్రిక్ టన్నులు, డీఊసీ 13,072, పొటాష్ 13,105, కాంప్లెక్స్ ఎరువులు 44,480 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా.
సన్న బియ్యం
జిల్లాలో 3,81,584 ఆహార భద్రత, 20,910 అంత్యోద య, 1,016 అన్నపూర్ణ కార్డులు మొత్తం 4,03,510 ఆహార భద్రతకార్డులు ఉన్నాయి. ఆహార భద్రత కింద 13,94,503 మంది లబ్ధి పొందుతున్నారు.
మహాలక్ష్మి
మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 2,42,710 మంది గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ విడుదల చేసి మొత్తం రూ.30.73 కోట్ల చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 3.59 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు.
కళ్యాణ లక్ష్మి – షాదీముబారక్
కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,126 మంది లబ్ధిదారులకు రూ.61 కోట్ల 33 లక్షలు అందాయి. అలాగే షాదీ ముబారక్ ద్వారా 3,585 మంది లబ్ధిదారులకు సుమారు రూ.35 కోట్ల 85 లక్షల ఆర్థికసాయం అందింది.
గృహజ్యోతి
గృహజ్యోతి ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.142.86 కోట్ల సబ్సిడీ అందజేసింది. నాయీబ్రాహ్మణ, రజక వృత్తులకు చెందిన 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందుతోంది.
న్యూస్రీల్
చేయూత పథకం ద్వారా ప్రతినెలా 2,68,952 మందికి రూ.57 కోట్ల 94 లక్షలు.
గల్ఫ్ దేశాల్లో మరణించిన 55 మంది కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద రూ.5లక్షల చొప్పున రూ.2కోట్ల 75లక్షలు అందాయి.
ఉపాధిహామీ ద్వారా 1,73,628 మంది కూలీలకు పని అవకాశం కలిగింది.
బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గాలకు రెండో విడతలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ మంజూరయ్యా యి. ఒక్కో స్కూల్కు రూ.200 కోట్ల చొప్పు న రూ.600 కోట్ల నిధులు ప్రభుత్వ కేటా యింపు.
వన మహోత్సవం 2025–26 లో 51.493 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ జనవరి 19న ప్రారంభమైంది. అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మూఢనమ్మకాల బారినపడకుండా ప్రజలను పోలీసులు చైతన్యం చేస్తున్నారు.

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి