
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
డిచ్పల్లి: అనారోగ్యంతో మెరుగైన వైద్యం చేయించుకోలేని బాధితులకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని డీసీసీ డెలిగేట్ వాసుబాబు పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో శుక్రవారం ఎనిమిది మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సైతం తిరిగి మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మురళి, మురారి, సోమనాథ్, పిచ్చయ్య, యాదయ్య, వెంకట్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఆర్వోబీ పనులు
నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం పెద్ద క్రేన్ సహాయంతో పిల్లర్ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో కాంక్రిట్ను నింపుతున్నారు. పనులు చేపట్టేందుకు పెద్ద క్రేన్ రావడంతో ప్రయాణికులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్