
రికార్డులు తారుమారు చేస్తే పట్టాలు రద్దు
ఎడపల్లి / రెంజల్ : మోసపూరితంగా హక్కుల రికా ర్డులను తారుమారు చేసి ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారం భూ భారతి చట్టం కల్పించిందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పేర్కొన్నారు. కొత్త చట్టంలో సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. ఎడపల్లి, రెంజల్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో సోమవా రం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా మ్యుటేషన్ అధికారాలను స్థానిక అధికారు లకు కల్పించారని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరగని పక్షంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, అవసరమైతే రైతులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. భూభారతితో భూ వివాదాలకు చెల్లు చీటి పెట్టవచ్చన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 17 రాష్ట్రాల్లో అమలవుతున్న తీరు ను అధ్యయనం చేసి తర్వాతే ఆర్వోఆర్ చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. 2014 జూన్ 2 కంటే ముందు తెల్ల కాగితాలపై రాసుకొని భూములు కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఆర్డీవో విచారణ చేపట్టి అన్నీ సవ్యంగా ఉంటే రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఫీజులు తీసుకొని పట్టా జారీ చేస్తారని తెలిపారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పు లుంటే సవరించుకునే వెసులుబాటును భూ భారతి కల్పిస్తోందన్నారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్లు శ్రావణ్కుమార్, ధన్వాల్, ఇన్చార్జి ఎంపీడీవో రఫీయోద్దీన్, వ్యవసాయాధికారులు ప్రదీప్, శ్రీనివాస్రావ్, పీఏసీఎస్ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.
భూ భారతి చట్టంతో అధికారాలు
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు