
గంజాయిపై ఉక్కుపాదం
మోపాల్(నిజామాబాద్రూరల్): గంజాయి రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లావ్యాప్తంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. మోపాల్ పోలీస్స్టేషన్ను సోమవారం సాయంత్రం సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో కేసుల వివరాలను ఎస్సై యాదగిరి గౌడ్ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ మొత్తం కలియతిరిగి సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ మత్తుపదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి కౌన్సెలింగ్ చేపట్టాలని సూచించారు. సైబర్ మోసాలు, గేమింగ్ యాప్లతో నష్టపోకుండా అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు మంచిప్ప కొండెం చెరువు, పెద్ద చెరువు వద్ద చేపడుతున్న ప్రాజెక్టు ను సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సౌత్ రూరల్ సీఐ సతీశ్కుమార్, ఎస్సై యా దగిరి గౌడ్, ఏఎస్సై రమేశ్ బాబు ఉన్నారు.
సీపీ సాయి చైతన్య