
గీతకార్మికులపై వీడీసీ ఆగడాలు ఆపాలి
నిజామాబాద్ సిటీ : కల్లుగీత కార్మికులపై వీడీసీ సభ్యులు చేస్తున్న ఆగడాలను వెంటనే ఆపాలని కల్లుగీత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గీత కా ర్మికులపై వీడీసీ వారు గత ఆరు నెలలుగా అనేక ఇ బ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు మధ్యయుగం నాటి రాజరిక వ్యవస్థలు గుర్తొస్తున్నాయన్నారు. గీత కార్మికులు పెంచుతున్న ఈత చెట్లను కాల్చివేస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్య లు తీసుకోవాలని కోరారు. సమావేశంలో శేఖర్ గౌడ్, పెద్ది వెంకట్రాములు, నరసింహులు గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీరామ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.