గీతకార్మికులపై వీడీసీ ఆగడాలు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

గీతకార్మికులపై వీడీసీ ఆగడాలు ఆపాలి

Apr 13 2025 1:54 AM | Updated on Apr 13 2025 1:54 AM

గీతకార్మికులపై వీడీసీ ఆగడాలు ఆపాలి

గీతకార్మికులపై వీడీసీ ఆగడాలు ఆపాలి

నిజామాబాద్‌ సిటీ : కల్లుగీత కార్మికులపై వీడీసీ సభ్యులు చేస్తున్న ఆగడాలను వెంటనే ఆపాలని కల్లుగీత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గీత కా ర్మికులపై వీడీసీ వారు గత ఆరు నెలలుగా అనేక ఇ బ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు మధ్యయుగం నాటి రాజరిక వ్యవస్థలు గుర్తొస్తున్నాయన్నారు. గీత కార్మికులు పెంచుతున్న ఈత చెట్లను కాల్చివేస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్య లు తీసుకోవాలని కోరారు. సమావేశంలో శేఖర్‌ గౌడ్‌, పెద్ది వెంకట్రాములు, నరసింహులు గౌడ్‌, శేఖర్‌ గౌడ్‌, శ్రీరామ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement