
మాట్లాడుతున్న కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
సుభాష్నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధి తులకు సత్వర న్యాయం జరిగేలా కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేసి నిర్ణీత గడువులోపు చార్జ్షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో శు క్రవారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యా ప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివి జన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాల ని సూచించారు. న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్న కేసుల్లోనూ ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుని తదనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థికసాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. పోలీస్శాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను సత్వరమే పంపించాలని, తద్వారా మిగతా వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. పెండింగ్ ట్రయ ల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి శశికళ, ఆర్డీవో వినోద్ కుమార్, డీటీడబ్ల్యూవో నాగూరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
కేసుల దర్యాప్తు పురోగతిపై డివిజన్ల వారీగా సమీక్ష