నేడు నగరంలో విద్యుత్ అంతరాయం
నిజామాబాద్నాగారం: నగరంలోని దుబ్బ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ ఫీడర్ లైన్లో గురువారం మరమ్మతులు చేపట్టనున్నట్లు ఏడీఈ టౌన్2 రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో నేడు ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. మహేశ్వరి భవన్, గౌడ్స్ కాలనీ, గుమస్తా కాలనీ, దుబ్బా బైపాస్ రోడ్, దుబ్బ సబ్ స్టేషన్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.
నేడు స్విమ్మింగ్పూల్ ప్రారంభం
నిజామాబాద్నాగారం: నగరంలోని సుభాష్నగర్లో ఉన్న ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ పునః ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1 నుంచి స్విమ్మింగ్ పూల్ అందరికి అందుబాటులో ఉంటుందని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తెన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు ఈత కొలను అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.