అటవీ అధికారులపై కేసులు పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

అటవీ అధికారులపై కేసులు పెట్టాలి

May 31 2025 12:58 AM | Updated on May 31 2025 12:58 AM

అటవీ అధికారులపై కేసులు పెట్టాలి

అటవీ అధికారులపై కేసులు పెట్టాలి

బెల్లంపల్లి: పేద దళిత రైతులపై దాడులు చేస్తున్న అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్‌ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధిత రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు సర్వే నంబర్‌ 65, 67లో ఉన్న భూములను ఐదు దశాబ్దాల నుంచి సాగు చేసి జీవిస్తున్నారని తెలిపారు. అటవీ అధికా రులు అడ్డుతగులుతూ దాడులకు తెగబడుతున్నార ని విమర్శించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం డీఏఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు బి.కేశవరెడ్డి, రైతులు బానయ్య, లింగయ్య, సతీష్‌, రాజయ్య, పర్వతాలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement