పార్టీ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతమే లక్ష్యం

Apr 30 2025 12:42 AM | Updated on Apr 30 2025 12:42 AM

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం

జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పీసీసీ అబ్జర్వర్లు చంద్రశేఖర్‌గౌడ్‌, అవేజ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపే తం చేయడమే లక్ష్యమని పీసీసీ అబ్జర్వర్లు, చంద్రశేఖర్‌గౌడ్‌, అవేజ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం పార్టీ జి ల్లా విస్తతస్థాయి సమావేశం డీసీసీ అధ్యక్షుడు కూ చాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి ప హల్గాం మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేక బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు సోషల్‌ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మే 4నుంచి 10వరకు బూత్‌ స్థాయి సమావేశాలు, మే 13 నుంచి 20వరకు మండల స్థా యి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ముడుసు సత్యనారాయణ అనే పార్టీ కార్యకర్త ఎస్సీ నాయకులను వేదికపైకి పిలవలేదని ఆరోపించారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కలగజేసుకుని వేదికపై ఎస్సీ నాయకులు ఉండగా అనవసర రా ద్ధాంతం చేయకూడదని సముదాయించారు. కాంగ్రెస్‌ క్రమశిక్షణ గల పార్టీ అని, అనవసర ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని పీసీసీ అబ్జర్వర్లు హె చ్చరించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వడ్మ బొజ్జు పటే ల్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త పనిచేయాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్‌, రేఖానాయక్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌ అలీ హాజరయ్యారు.

పని చేసేవారికే పదవులు

పార్టీ కోసం పని చేసినవారికే పదవులు దక్కుతా యని పీసీసీ అబ్జర్వర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు. జి ల్లా కేంద్రంలోని మారుతి ఇన్‌ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు సీఎం రే వంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు. ఇచ్చిన హామీ లు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానా లను కై వసం చేసుకుంటామని చెప్పారు. జిల్లా స్థా యి సమావేశంలో ఎస్సీలకు సముచిత స్థానం కేటా యించలేదని కార్యకర్త సత్యనారాయణ చేసిన ఆరో పణలను ఖండించారు. పార్టీ మహిళా విభాగం జి ల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లాలో 2014 నుంచి ఎస్సీ మహిళనే జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతుందని చెప్పా రు. కాంగ్రెస్‌ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. పీసీసీ పరిశీలకుడు అవేజ్‌, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఐకే రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement