ఎయిడ్స్‌వ్యాధి నిర్మూలనకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌వ్యాధి నిర్మూలనకు పాటుపడాలి

Dec 2 2025 7:22 AM | Updated on Dec 2 2025 7:22 AM

ఎయిడ్స్‌వ్యాధి నిర్మూలనకు పాటుపడాలి

ఎయిడ్స్‌వ్యాధి నిర్మూలనకు పాటుపడాలి

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

ములుగు రూరల్‌: ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అడ్డంకులను అధిగమిద్దాం, ఎయిడ్స్‌ ప్రతిస్పందనను మారుద్దాం అనే నినాదంతో ఈ సంవత్సరమంతా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి చెందే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధిని అరికట్టవచ్చని వివరించారు. కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి చంద్రకాంత్‌, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీకాంత్‌, రణధీర్‌, డీపీఎంవో సంజీవరావు, డెమో సంపత్‌, ఏఎంఓ దుర్గారావు, ఎయిడ్స్‌ జిల్లా నియంత్రణ ప్రోగ్రాం మేనేజర్‌ నీలిమా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement