హేమాచలుడిని దర్శించుకున్న ఎన్నికల వ్యయపరిశీలకులు | Sakshi
Sakshi News home page

హేమాచలుడిని దర్శించుకున్న ఎన్నికల వ్యయపరిశీలకులు

Published Fri, May 10 2024 3:15 PM

హేమాచలుడిని దర్శించుకున్న ఎన్నికల వ్యయపరిశీలకులు

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల వ్యయపరిశీలకులు రాంకుమార్‌ గోపాల్‌ గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి అర్చన జరిపించి ఆశీర్వచనం ఇచ్చారు. స్వయంభు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయానికి వచ్చిన ఆయన ముందుగా పవిత్ర చింతామణి జలపాతాన్ని సందర్శించి చింతామని జలపాతం ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల స్పెషలాఫీసర్‌ తుల రవి, తహసీల్దార్‌ వీరస్వామి, ఎంపీఓ మమత, ఆర్‌ఐ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement