
మృగశిర కార్తె సందడి
● చేపల కొనుగోలుకు ఎగబడిన జనం ● జిల్లాలో 400 నుంచి 500 క్వింటాళ్ల విక్రయాలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని చేపల మార్కెట్లు ఆదివారం జనసందడిగా మారాయి. మృగశిరకార్తె కావడంతో జిల్లా కేంద్రంలోని చేపలమార్కెట్, కాలేజ్రోడ్డు, హమాలీవాడ రైల్వేగేట్, ప్రభుత్వ ఐటీఐ వద్ద చేపల కొనుగోలుకు జనం ఎగబడ్డారు. ఇదే అ దనుగా భావించిన మత్స్యకారులు సాధరణ రోజు ల కంటే రెట్టింపు ధరలకు చేపలు విక్రయించారు. మృగశిర కార్తె నాడు చేపలు తింటే సర్వరోగాలు న యమవుతాయని ప్రజల నమ్మకం. జిల్లాలో సుమా రు 400 నుంచి 500 క్వింటాళ్ల చేపల విక్రయాలు జ రిగాయి. బొమ్మ చేప కిలో రూ.400 నుంచి రూ. 600, రవులు, మెరిగే, బొచ్చె చేపలు కిలోకు రూ. 200 నుంచి రూ. 300 ధర పలికాయి. చేపల మసా ల వాసనతో వీధులన్నీ ఘుమఘుమలాడాయి.