
అప్రమత్తంగా ఉన్నాం
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో అప్రమత్తం చేశాం. జిల్లా టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. వర్షాలు కురవకముందే జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్యం, తాగునీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. రాపిడ్ రెస్పాన్స్ టీంలను జిల్లాతోపాటు, మండలాల వారీగా ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్ను అందుబాటులో ఉంచాం. ఎక్కడ సీజనల్ వ్యాధులు వచ్చినా, వెంటనే అన్ని శాఖ అధికారులు అప్రమత్తమై, వ్యాధులు ప్రబలకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలోనూ పరిశుభ్రత, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చర్యలు చేపడతాం.
– డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి