
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
లక్సెట్టిపేట: విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్లో గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం త్రిమూర్తి, చింత అశోక్, పూర్ణచందర్, శ్రీనివాస్, ఆరీఫ్, పింగిళి రమేశ్, రాజు, రవీందర్, శ్రీనివాస్, నిర్వాహకులు బొప్పు సుమన్, తదితరులు పాల్గొన్నారు.