
‘దళితుడిననే వేధిస్తున్నారు..’
జన్నారం: ఇసుకను అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కొందరు వ్యక్తులు కక్షగట్టి దళిత అధికారినని వేధిస్తున్నారని ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఓ ఇసుక ట్రాక్టర్ను ఆపిన బీట్ అధికారిపై దాడి చేసినందుకు కేసు పెడితే కావాలని వేధిస్తున్నాడన్నారు. ఓ యూట్యూబ్ చానల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో సెక్షన్ అధికారి హన్మంతరావు, బీట్ అధికారులు బానయ్య, రుబీనా, ప్రణయ్, పోచయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.