‘దళితుడిననే వేధిస్తున్నారు..’ | - | Sakshi
Sakshi News home page

‘దళితుడిననే వేధిస్తున్నారు..’

Jun 9 2025 1:00 AM | Updated on Jun 9 2025 1:00 AM

‘దళితుడిననే వేధిస్తున్నారు..’

‘దళితుడిననే వేధిస్తున్నారు..’

జన్నారం: ఇసుకను అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కొందరు వ్యక్తులు కక్షగట్టి దళిత అధికారినని వేధిస్తున్నారని ఇందన్‌పల్లి రేంజ్‌ అధికారి కారం శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఓ ఇసుక ట్రాక్టర్‌ను ఆపిన బీట్‌ అధికారిపై దాడి చేసినందుకు కేసు పెడితే కావాలని వేధిస్తున్నాడన్నారు. ఓ యూట్యూబ్‌ చానల్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో సెక్షన్‌ అధికారి హన్మంతరావు, బీట్‌ అధికారులు బానయ్య, రుబీనా, ప్రణయ్‌, పోచయ్య, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement