
బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీ కాలనీలోని మంచిర్యాల క్లబ్లో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాజుల ముఖేశ్ గౌడ్, సింగరేణి పవర్ప్లాంట్ డీజీఎం పంతుల హాజరై పోటీలు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి వందకుపైగా క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 11, 13, 15, 17, 19 బాలబాలికలు, మెన్ అండ్ వుమెన్, మాస్టర్స్ 35 ప్లస్ నుంచి 75 ప్లస్ వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్, హర్షవర్దన్, కృష్ణ, రవి, మధు, శ్రీనివాస్ రెడ్డి, నంద శ్రీనివాస్, మహేశ్, మురళి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.