అర్చకులకు ఊతం.. | - | Sakshi
Sakshi News home page

అర్చకులకు ఊతం..

Jun 9 2025 12:54 AM | Updated on Jun 9 2025 12:54 AM

అర్చకులకు ఊతం..

అర్చకులకు ఊతం..

● ఆలయాలకు వరం ● పరిశీలనలో డీడీఎన్‌ఎస్‌ దరఖాస్తులు ● ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 726 దరఖాస్తులు

దండేపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన, చారి త్రాత్మక దేవాలయాల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం, దేవాదాయ, ధర్మాదాయశాఖ దూపదీప నైవేద్య పథకం(డీడీఎన్‌ఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గత మే నెలలో డీడీఎన్‌ఎస్‌ కింద దేవాలయాలను చేర్చేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్పటి నుంచి గతనెల మే 24 వరకు దేవాదాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఆలయాల ఎంపికకు అధి కారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఈప్రక్రియ పూర్తయితే గ్రామీణ, పురపాలికల్లోని ఆలయాలకు మహర్దశ పట్టనుంది. దేవతామూర్తులకు అర్చకులతో దూపదీప, నైవేద్య, పూజాది కార్యక్రమాలు నిరంతరం కొనసాగనున్నాయి. భక్తుల దర్శనంతోపాటు దాతల సహకారంతో సౌకర్యాలు కల్పించేందుకు వీలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం పథకం కింద ఉమ్మడి జిల్లాలో 729 దేవాలయాలు కొనసాగుతున్నాయి.

ఎంపిక ప్రక్రియ షురూ..

దూపదీప నైవేద్యం పథకం కింద పూజాది కార్యక్రమాలకు రూ.4 వేలు, ఆలయ అర్చకుడికి గౌరవ వేతనం రూ.6 వేలు అందజేస్తారు. ఈ పథకంలో దే వాలయాల ఎంపికకు జిల్లాస్థాయి కమిటీని నియమిస్తారు. ఇందులో దేవాదాయశాఖ సహాయ కమి షనర్‌తోపాటు అధికారులు, ఆగమశాస్త్ర వేదపండితులు సభ్యులుగా ఉంటారు. అన్ని అర్హతలున్నా ఆలయాల సమాచారాన్ని దేవాదాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత డీడీఎన్‌ఎస్‌ పథకాన్ని అమలు చేసి మంజూరు పత్రాలు అందజేస్తారు. గత నోటిఫికేషన్‌ 2022 ఏప్రిల్‌–మే నెలలో విడుదలైంది. అప్పుడు 767 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి నోటిఫికేషన్‌కు 726 దరఖాస్తులు వచ్చా యి. అప్పటితో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య కొద్దిగా తగ్గింది. అర్హతలున్నా పలు దేవాలయాలకు రిజిస్ట్రేషన్‌ సక్రమంగా లేకపోవడంతో దరఖాస్తు చేయలేదు. నూతన దేవాలయాలు నిర్మించిన వారు రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంతో అవకాశం కో ల్పోయారు. కొందరు అర్చకులకు అవగాహన లేక కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు.

దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది

ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల నుంచి డీడీఎన్‌ఎస్‌ కింద దరఖాస్తులు స్వీకరించాం. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. త్వరలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసి, డీడీఎన్‌ఎస్‌ కింద దరఖాస్తులు చేసుకున్న ఆలయాలను సందర్శిస్తారు. సందర్శనాంతరం నివేదికను తయారు చేసి, ఎంపిక కోసం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయానికి పంపిస్తాం.

– ఎన్‌.నవీన్‌, దేవాదాయశాఖ

ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌

ఉమ్మడి జిల్లాలో డీడీఎన్‌ఎస్‌ కింద

వచ్చిన దరఖాస్తులు

ఆదిలాబాద్‌ – 219 ఆసిఫాబాద్‌ – 102

మంచిర్యాల – 110 నిర్మల్‌ – 295

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement