భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి | - | Sakshi
Sakshi News home page

భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి

May 11 2025 12:14 AM | Updated on May 11 2025 12:14 AM

భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి

భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి

మందమర్రిరూరల్‌: భూగర్భ గనులు, ఓపెన్‌ కాస్టు గనుల్లో విద్యుత్‌ భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలని సింగరేణి డీడీఎంఎస్‌(ఎలక్ట్రికల్‌) రాజీవ్‌ ఓం ప్రకాశ్‌వర్మ అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని కేకేఓసీ, కేకే 5 గనుల్లో నాలుగు రోజులపాటు సాధారణ తనిఖీలు నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఎలక్ట్రికల్‌ సేఫ్టీ, సాంకేతిక ఇంటరాక్టివ్‌ సెషన్‌లో విద్యుత్‌ అపాయాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం దేవేందర్‌, బెల్లంపల్లి రీజియన్‌ జీఎం సేఫ్టీ రఘుకుమార్‌, ఎస్‌వోటు జీఎం విజయ ప్రసాద్‌, ఏరియా ఇంజనీర్‌ వెంకటరమణ, ఏఎస్‌వో రవీందర్‌, కేకే గ్రూప్‌ ఏజెంట్‌ రాంబాబు, కేకే ఓసీపీవో మల్లయ్య, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement