భూగర్భ గనిలో పనికి భయపడి ఆత్మహత్య● | Sakshi
Sakshi News home page

భూగర్భ గనిలో పనికి భయపడి ఆత్మహత్య●

Published Fri, May 10 2024 4:10 PM

భూగర్భ గనిలో పనికి భయపడి ఆత్మహత్య●

మంచిర్యాలక్రైం: తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగం చేయలేక ఓ సింగరేణి కార్మికుడు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హమాలివాడకు చెందిన ఊరుగొండ ఓదెలు సింగరేణిలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయి రెండో కు మారుడు సాయికుమార్‌(27)ను పనిలో పె ట్టించాడు. గత నెల 20న ఆర్‌జీ–1 గోదావరిఖని మైన్‌లో బదివీ వర్కర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి సాయికుమార్‌ తరచూ తండ్రితో నాన్న నాకు మైన్‌లో దిగాలంటే భయంగా ఉంది.. నేను ఉద్యోగం చేయలేనంటూ మొరపెట్టుకునేవాడు. కొన్ని రోజు లు కష్టపడితే ఓపెన్‌కాస్ట్‌లో పెట్టిస్తానని తండ్రి ధైర్యం చెప్తూ వచ్చాడు. గురువారం డ్యూటీకి వెళ్లిన సాయికుమార్‌ రైలు ప ట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement