
మృగశిర కార్తె సందడి
నెహ్రూసెంటర్: మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే నానుడి ఉంది. ఆదివారం మృగశిర కార్తె కావడంతో జిల్లా కేంద్రంలో చేపలను కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. సాధారణ రోజుల్లో కేజీ రూ.150 నుంచి రూ. 500 వరకు వివిధ రకాల చేపలను విక్రయించే వారు. మృగశిర కార్తె సందర్భంగా అందుకు భిన్నంగా రూ. 250 నుంచి రూ. 600పైగా ధరలకు వివిధ రకాల చేపలను విక్రయించారు. అయినప్పటికీ ప్రజలు కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు.
చేపల కొనుగోలుకు
ఆసక్తి చూపిన ప్రజలు
కేజీ రూ. 250 నుంచి రూ. 600 వరకు అమ్మకాలు

మృగశిర కార్తె సందడి