నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు, అనుమతి లేని విత్తనాల కోసం తనిఖీలు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీమ్లు కూడా ఏర్పాటు చేశాం. వీటితో పాటు హెచ్టీ పత్తి విత్తనాల కోసం తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాదికి సంబంధించి ఇంతవరకు అనధికార విత్తనాలు, నకిలీలు పట్టుబడలేదు. ఎక్కడైన అనుమతి లేని విత్తనాలు అమ్ముతుంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
– పీఎల్ వరలక్ష్మి,
జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు