
‘మోహినీ’ అలంకరణలో సింహరూపుడు
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీనృసింహస్వామి జగన్మోహినీ అలంకరణతో భక్తులను కనువిందు చేశారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకలశ స్థాపన గావించారు. ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంభరాలతో మోహినీగా అలంకరించి పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.