ఇళ్ల నిర్మాణం పూర్తయితే కొత్త ఊర్లే | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణం పూర్తయితే కొత్త ఊర్లే

Apr 1 2023 2:12 AM | Updated on Apr 1 2023 2:12 AM

లబ్ధిదారులతో మాట్లాడుతున్న్ల కలెక్టర్‌ కోటేశ్వరరావు 
 - Sakshi

లబ్ధిదారులతో మాట్లాడుతున్న్ల కలెక్టర్‌ కోటేశ్వరరావు

పత్తికొండటౌన్‌: ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగనన్న కాలనీలు కొత్త గ్రామాలుగా మారతాయని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం పత్తికొండ పట్టణ శివారులోని జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్‌ డీఈ గురుప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే రోడ్లు వేస్తామన్నారు. అనంతరం చక్రాళ్లరోడ్డులో ఉన్న కస్తూర్బా విద్యాలయం, అంబేడ్కర్‌ బాలికల గురుకులాలను సందర్శించిన పదో తరగతి విద్యార్థినులతో కలెక్టర్‌ మాట్లాడారు. కస్తూర్బా విద్యాలయంలో నాడు–నేడు పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామసచివాలయం–6ను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement