
4.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
అవనిగడ్డ: రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో పలుసార్లు అక్రమ రవాణాదారులను పట్టుకున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దందా యథాతథంగా సాగుతోంది. అవనిగడ్డలో మంగళవారం తెల్లవారు జామున 4.5 టన్నులు రేషన్ బియ్యాన్ని ఎస్ఐ శ్రీనివాస్ పట్టుకున్నారు. తెల్లవారు జాము 4.30 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా, రాజీవ్ గాంధీ సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో నివసించే కూతాడి వెంకన్నకు చెందిన వాహనంలో 2.50 టన్నులు, అవనిగడ్డలో నివసించే కోసూరు రాజారావుకు చెందిన వాహనంలో రెండు టన్నులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం వచ్చిన సంచులను వచ్చినట్టుగానే అక్రమ రవాణా చేయడం కొసమెరుపు. కనీసం సంచులు కూడా మార్చకుంగా రవాణా చేస్తున్నారంటే అక్రమ దారులు ఎంత ధీమాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

4.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

4.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత