నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు

Jun 8 2025 1:28 AM | Updated on Jun 8 2025 1:28 AM

నిత్య

నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ. 2.52 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోని రామచంద్రనగర్‌కు చెందిన బట్టు నాగేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. నాగేశ్వరరావు పేరిట రూ. 1,51,116 విరాళాన్ని, జిష్ణురావు పేరిట బంగారు తాపడం పనులకు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

నేడు ఏపీసీబీఈఏ

రాష్ట్ర మహాసభలు

చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏపీసీబీఈఏ) పదో రాష్ట్ర మహాసభలు మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.గోపీనాథ్‌ శనివారం తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్‌లోని రెవెన్యూ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. మహాసభలకు 13 జిల్లాల డీసీసీబీ ఉద్యోగులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు తప్పని సరిగా హాజరుకావాలని ఆయన కోరారు.

రైల్వేస్టేషన్‌లో

ఆహార భద్రతపై శిక్షణ

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని స్టేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఆహార భద్రతపై రైల్వే ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, ఎఫ్‌బీఓ (ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్స్‌)లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథి రైల్వే హాస్పటల్‌ సీఎంఎస్‌ డాక్టర్‌ శ్రీనివాసులు ఆహార భద్రతపై పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. నిబంధనలకు అనుగుణంగా ఆహారం తయారీ, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహారాన్ని సక్రమంగా నిల్వచేయడం వంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ‘ఈట్‌ రైట్‌ ఉద్యమం’ ఆరోగ్యకరమైన ఆహార వాతావరణానికి బలమైన పునాది వేసిందని, ఆ దిశగా విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆహార భద్రతపై నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో రైల్వే హాస్పటల్‌ ఏసీఎంఎస్‌ డాక్టర్‌ ఎం.జైదీప్‌, రైల్వే ఫుడ్‌ సేప్టీ ఆఫీసర్‌ ఎస్‌.కె. రెహ్మతుల్లా, స్టేషన్‌ డైరెక్టర్‌ శైలజ, స్టేషన్‌ మాస్టర్‌ సాంబశివరావు, ఐఆర్‌సీటీసీ ఏఎం రాజా తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శోభాయాత్ర

విజయవాడ కల్చరల్‌: వేంకటేశ్వరుడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండప ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దేవాలయంలో నిర్వహించిన వైదిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉదయం వేంకటేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకీపై పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. దేవాలయన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్టీటీపీఎస్‌లో

ఏపీఎస్పీఎఫ్‌ డీజీ

ఇబ్రహీంపట్నం: ఏపీఎస్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ త్రివిక్రమ వర్మ శనివారం ఎన్టీటీపీఎస్‌ను సందర్శించారు. ప్రధాన గేటు వద్ద ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ప్లాంట్‌లో స్టేజి 1 నుంచి 4 వరకు సందర్శించారు. కోల్‌ప్లాంట్‌లో వ్యాగన్‌ టిప్లర్‌ గురించి ఏడీఈ హేమానంద్‌ వివరించారు. ఎస్‌ఈ అనురాధ కోల్‌తో విద్యుత్‌ తయారీ విధానం.. యూనిట్‌ కంట్రోల్‌ బోర్డు ద్వారా వివరించారు. ఏపీఎస్పీఎఫ్‌ కమాండెంట్‌ ముద్దాడ శంకరరావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ కృష్ణమాచారి పాల్గొన్నారు.

నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు  
1
1/1

నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement