
కరోనాలో ముందుగానే వాహనమిత్ర
నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దపాప ఇంటర్. రెండో పాప పది పూర్తి చేసింది. చిన్నపాప టెన్త్ చదువుతోంది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా ఏటా రూ. 10 వేలు లబ్ధి చేకూరింది. కరోనా లాక్డౌన్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. బతకడం కష్టమైంది. ఆ సమయంలో ఆర్నెలలు ముందుగానే వాహనమిత్ర ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. అమ్మఒడి పథకంలో నాలుగేళ్లు లబ్ధి పొందాం. కూటమి ప్రభుత్వం బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్కు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. ఏడాది నుంచి ఏ పథకం లేదు. తల్లికి వందనం కూడా ఇవ్వలేదు. పిల్లల చదువులు భారంగా మారాయి.
– ఈశ్వర్, ఆటోడ్రైవర్ గొల్లపూడి
●