ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు

Jun 3 2025 6:52 AM | Updated on Jun 3 2025 6:52 AM

ముగిస

ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు

నరసరావుపేట ఈస్ట్‌: ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ ఆక్వాటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్‌ జిల్లాల 11వ సీనియర్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌– 2025 పోటీల్లో ఎన్టీఆర్‌ జిల్లా ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. రన్నర్స్‌ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించిన ఈ పోటీలలో పురుషుల వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను ఎం.శరత్‌ (ఎన్టీఆర్‌ జిల్లా) సాధించగా, మహిళల విభాగంలో సన్వి కొంగర, యు.ప్రేమాంమృత (ఎన్టీఆర్‌ జిల్లా) సంయుక్తంగా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ కొంగర రవికాంత్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను అభినందించారు. పోటీలలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్ర స్విమ్మింగ్‌ జట్టు క్రీడాకారులు త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరగనున్న 78వ సీనియర్‌ నేషనల్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఓబుల్‌రెడ్డి, వెంకట్‌రామ్మోహన్‌, పల్నాడుజిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష్య, కార్యదర్శులు డాక్టర్‌ ఏ.ఏ.రామలింగారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓవరాల్‌చాంప్‌ ఎన్టీఆర్‌ జిల్లా రన్నర్స్‌గా కర్నూలు జిల్లా

ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు 1
1/1

ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement