
ఎన్టీఆర్ జిల్లాకు ఓవరాల్ చాంపియన్ షిప్
విజయవాడస్పోర్ట్స్: 11వ జాతీయ అంతర జిల్లాల స్విమ్మింగ్ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 16గోల్డ్, 10 సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్తో అత్యధికంగా 116 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫిని కై వసం చేసుకున్నారు. విజయవాడ క్రీడాకారులు ఎం.శరత్, కె.సాన్వి, యు.ప్రేమామృత వ్యక్తిగత విభాగంలో ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. ఛాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను ఏపీ అమెచ్యూర్ అక్వాటిక్ సంఘం చైర్మన్ కె.రవికాంత్, అధ్యక్షులు ఎం.ఓబుల్రెడ్డి, కార్యదర్శి ఎ.మోహన్వెంకట్రామ్, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఐ.రమేష్, కృష్ణాజిల్లా సంఘం అధ్యక్షకార్యదర్శులు డి.భాస్కర్, వి.వినోద్ అభినందించారు.