
యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకుని జూన్ 21వ తేదీన జరిగే యోగా కార్యక్రమానికి సంసిద్ధం కావాలన్నారు. ఈ నెల 27వ తేదీన మచిలీపట్నంలో మహార్యాలీ నిర్వహిస్తున్నామని ఉద్యోగులతో పాటు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. 27 నుంచి 31వ తేదీ వరకు మండల, గ్రామస్థాయిలో ట్రైనర్లకు యోగాపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. ఈ నెల 31వ తేదీన మంగినపూడి బీచ్ లో, జూన్ 6వ తేదీన కూచిపూడిలోని నాట్యకళాక్షేత్రం, 13న ఘంటసాలలోని బౌద్ధక్షేత్రం, 19న మో పిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రాంగణంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించటమైందన్నారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ