
అక్రమంగా తరలిస్తున్న పశువుల స్వాధీనం
తిరుమలాయపాలెం: అనుమతి లేకుండా రవాణా చేస్తున్న పశువులు, వ్యాన్ను తిరుమలాయపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆవు దూడలను ట్రాలీ ఆటోలో తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం అర్ధరాత్రి పాతర్లపాడు సమీపాన తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా వ్యాన్ డ్రైవర్ నరేష్, వ్యాపారులు మాదాసు వెంకన్న, బత్తుల నరేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.జగదీష్ తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న ఆవుదూడలను గురువారం గొల్లగూడెంలోని గోశాలకు తరలించామని వెల్లడించారు.
టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
మధిర: మధిర మండలం సిరిపురం పాత టోల్ గేట్ వద్ద టిప్పర్లను మల్లారం, రొంపిమల్ల గ్రామస్తులు గురువారం అడ్డుకుని నిరసన తెలిపారు. హైవే నిర్మాణానికి సామగ్రి తీసుకెళ్లే టిప్పర్ల రాకపోకలతో సిరిపురం – నెమలి రోడ్డుపై గోతులు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తారని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మల్లారం మాజీ సర్పంచ్ ఉపేంద్ర, కొంగర రంగయ్యతో పాటు మల్లారం, రొంపిమల గ్రామస్తులు పలువురు ల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల నిరసన
పాల్వంచ/మణుగూరు రూరల్: ఉత్తరప్రదేశ్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్(టీజీపీఈ) జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాల్వంచలోని కేటీపీఎస్, మణుగూరులోని బీటీపీఎస్ల ఎదుట గురువారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులపై కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని, ఉత్తరప్రదేశ్ కార్మికులకు అందరూ అండగా నిలవాలని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అసిస్టెంట్ ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులు రవిప్రసాద్, రవితేజ, బ్రహ్మాజీ, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న పశువుల స్వాధీనం