
తలసేమియా బాధితుల కోసం రక్తదానం
ఖమ్మంఅర్బన్: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఒకేరోజు 200మంది రక్తదానం చేశారు. ఖమ్మంకు చెందిన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ బాధితులను ఆదుకోవాలనే లక్ష్యంతో ‘సంకల్ప‘ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన శిబిరం ఏర్పాటుచేయగా తమ ఉద్యోగులు, మార్కెటింగ్ సిబ్బంది 200 మంది రక్తదానం చేశారని తెలిపారు. అనంతరం పిల్లల మందుల కోసం శ్రీ బాలాజీ ఫౌండేషన్ తరఫున రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఎస్టేట్స్, కన్స్ట్రక్షన్స్ ఎండీ వత్సవాయి రేణుకతో పాటు గోసు మధు, పోగుల రవికుమార్, అనిత, డాక్టర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
మధిర: మధిర మండలం మాటూరుపేట సమీపాన నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దెందుకూరు రోడ్డులోని ఓ కోళ్లఫామ్ షెడ్డులో బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో శుక్రవారం మధిర రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
సత్తా చాటిన హ్యాండ్బాల్ క్రీడాకారులు
ఖమ్మం స్పోర్ట్స్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మంమంగళపల్లిలో శుక్రవారం ముగిసిన రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానం దక్కించుకుంది. అంతేకాక జట్టు నుంచి ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, డాక్టర్ పి.రఘునందన్ తెలిపారు. క్రీడాకారులను అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పాముల శ్రీని వాసరావు, సీహెచ్.కృష్ణయ్య అభినందించారు.
అప్రమత్తతతోనే
వ్యాధులకు చెక్
మధిర: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ రాజశేఖర్గౌడ్ సూచించారు. మధిర ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కావాల్సిన మేర మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అంతేకాక వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.
‘భరత్’ పూర్వవిద్యార్థికి సన్మానం
మధిర: మధిరలోని భరత్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థి ఆలపాటి గోపీనాధ్ ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఓసీ కేటగిరీలో 55వ ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన ఆయనను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సన్మానించారు. కాగా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోపీనాథ్ భరత్ విద్యానికేతన్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివాడు.

తలసేమియా బాధితుల కోసం రక్తదానం

తలసేమియా బాధితుల కోసం రక్తదానం

తలసేమియా బాధితుల కోసం రక్తదానం

తలసేమియా బాధితుల కోసం రక్తదానం