
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
వేంసూరు: ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు సహా ఇద్దరు మృతి చెందారు. వేంసూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ప్రమా దం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన నగరకంటి నాగరాజు(38), ఆదివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన బొల్లిపోగు కృష్ణకుమార్(12) తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జయలక్ష్మీపురం నుంచి కొండెగట్ల ప్రధాన రహదారి వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలోని కొండెగట్ల చెరువు మూలమలుపు వద్ద ద్విచక్ర అదుపు తప్పి కింద పడ్డాక రహదారిపై రాసుకుంటూ వెళ్లి ఎదురుగా కూలీలతో వచ్చిన ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన నాగరాజు ఘటనాస్థలిలోనే మృతి చెందగా కృష్ణకుమార్ను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుల్లోకృష్ణ కుమార్ ఆరో తరగతి చదువుతుండగా, నాగరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నా రు. ఘటనపై కృష్ణకుమార్ తండ్రి ముత్తారావు ఫిర్యాదుతో కేసు నమెదు చేసినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు.
వాహనం ఢీకొని మహిళ...
వైరా: రోడ్డు దాటుతున్న మహిళను టాటా ఏస్ ఢీనడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందింది. వైరా యా దవబజార్కు చెందిన లక్ష్మి(52) సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతోంది. ఇదేసమయాన ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వస్తున్న టాటా ఏస్ ఆమెను ఢీకొనడంతో తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందు తూ ఆమె మృతిచెందింది. లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు.
లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు...
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి సమీపాన సోమవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం దివ్యాంగుల కాలనీకి చెందిన షేక్ అఫ్జల్పాషా(40) సెంట్రింగ్ మేసీ్త్ర కాగా, సోమవారం పందిళ్లపల్లిలో ఓ ఇంటి నిర్మాణ పనులు మాట్లాడుకుని తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో గ్రామ సమీపాన వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో కింద పడిన ఆయన పైనుంచి లారీ వెనుక టైరు వెళ్లగా అఫ్జల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాద సమయంలో ఖమ్మం నుంచి పందిళ్లపల్లి వస్తున్న మేకల నాగేశ్వరరావు తన బైక్తో అఫ్జల్ పాషా వాహనాన్ని ఢీకొట్టడంతో ఆయనకు సైతం గాయాలయయ్యాయి. ఈ గటనతో రెండు వైపులా రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, అఫ్జల్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి..
తల్లాడ: తల్లాడ మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని అన్నారుగూడెంకు చెందిన సూదాకృష్ణయ్య(53) ఆయన భార్యకు మాత్రలు తీసుకొచ్చేందుకు ఆదివారం అర్ధరాత్రి మోటార్ సైకిల్పై తల్లాడ వస్తుండగా లక్ష్మీనగర్ వద్ద గేదెలు అడ్డు రావడంతో వాటిని తాకి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను 108లో ఖమ్మంకు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.కొండల్రావు తెలిపారు.
గేదెను ఢీకొని వాహనదారుడు..
దమ్మపేట: గేదెను బైక్ ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన కూరం చంటి(36) తన బైక్పై దమ్మపేట మండలంలోని అంకంపాలెం వైపునకు సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, గండుగులపల్లి శివారుకు చేరుకునే సరికి చీకట్లో రోడ్డుపై గేదెను గమనించక ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంటి అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చంటి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి