బక్రీద్‌ను శాంతియుతంగా ఆచరించాలి | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ను శాంతియుతంగా ఆచరించాలి

Jun 5 2025 7:48 AM | Updated on Jun 5 2025 7:48 AM

బక్రీ

బక్రీద్‌ను శాంతియుతంగా ఆచరించాలి

చింతామణి: ఈనెల 7న బక్రీద్‌ పండుగను ముస్లింలు అన్ని వర్గాల సహకారంతో శాంతియుతంగా ఆచరించాలని ఏఎస్పీ జగన్నాఽథ్‌రై సూచించారు. పట్టణంలోని పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పండుగకు మాంసం వినియోగిస్తారని, దుకాణాల వారు చెత్తను ఇష్టానుసారంగా పడేయకుండా నగరసభ వాహనంలో వేయాలన్నారు. డీఎస్పీ మురళీధర్‌ మాట్లాడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు నగరసభ అనుమతి తీసుకోవాలన్నారు.

ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం

తుమకూరు: నిషేధిత ప్లాస్టిక్‌ విక్రయాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. బధవారం నగరంలోని పలు దుకాణాను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాల్లో 450 కిలోల ప్లాస్టిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకొని దుకాణ యాజమానులకు రూ.31వేల జరిమానా విధించారు. దాడుల్లో మెట్రో పాలిటన్‌ కార్పొరేషన్‌ అధికారి శివప్రసాద్‌, శోభ, సూపర్‌వైజర్‌ శంకర్‌, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.

పథకాలపై అవగాహన

తుమకూరు: ప్రభుత్వం పథకాల ద్వారా అందే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తుమకూరు ప్రజలకు జిల్లా కలెక్టర్‌ శుభకళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రెండేళ్లల సాధించిన విజయాలపై జిల్లా యంత్రాంగం, జిల్లా సమాచార, ప్రజా సంబంధ శాఖ సహకారంతో నగరంలోని బస్టాండులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌, సమావేశాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 10వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, ప్రజలు హాజరై ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని పొందాలని పిలుపునిచ్చారు.

బక్రీద్‌ను శాంతియుతంగా ఆచరించాలి 1
1/1

బక్రీద్‌ను శాంతియుతంగా ఆచరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement