
కాలువలో పడ్డ కారు
కేసీ కాలువలోకి పడ్డ కారు
మండ్య: మండ్య జిల్లాలోని వీసీ కెనాల తరచూ దుర్ఘటనలకు కేంద్రబిందువు అవుతోంది. కార్లు, వాహనాలు పడిపోవడం, ఈతకు వెళ్లి మరణించడం పరిపాటిగా మారింది. తాజాగా కేఆర్ సాగర పరిధిలో ఉన్న విశ్వేశ్వరయ్య (వీసీ) కాలువలో కారు పడిపోయి తండ్రీ, ఇద్దరు పిల్లలు మరణించారు. మైసూరు జిల్లాలోణి కేఆర్ నగర తాలూకాలోని హెబ్బాలుకు చెందిన కుమార స్వామి (38), పిల్లలు అయిన అద్వైత్ (8), అక్షత (3)గా గుర్తించారు.
పిల్లలతో కారులో బయల్దేరి
వివరాలు.. ఏప్రిల్ 16వ తేదీన కుమారస్వామి బెంగళూరు నుంచి కెఆర్ నగరకు కారులో శాంట్రో కారులో బయల్దేరాడు. ఈయన బెంగళూరులో చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. భార్యకు ఫోన్ చేసి కేఆర్ఎస్లో ఉంటానని చెప్పాడు. కానీ ఇంటికి చేరుకోలేదు. భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో కేఆర్సాగర పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టారు. మంగళవారం వీసీ కెనాల్లో వెతగ్గా కారు కనిపించింది. కారులో తండ్రి పిల్లల మృతదేహాలు ఉన్నాయి. పోలీసులు, స్థానిక జనం కలిపి కారును తాళ్లతో కట్టి బయటకు లాగారు. మృతదేహాలను స్థానిక మార్చురీకి తరలించారు. ఇది ప్రమాదం కాదు, ఆత్మహత్యేనని అనుమానాలున్నాయి. భార్య, బంధువులు తీవ్రంగా విలపించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
తండ్రీ, ఇద్దరు పిల్లలు మృతి
16వ తేదీ నుంచి మిస్సింగ్
మండ్య జిల్లాలో మిస్టరీ ఘటన

కాలువలో పడ్డ కారు

కాలువలో పడ్డ కారు