బాల్యంపై ‘బ్యాగు’ భారం | - | Sakshi
Sakshi News home page

బాల్యంపై ‘బ్యాగు’ భారం

Jul 7 2025 6:12 AM | Updated on Jul 7 2025 6:12 AM

బాల్యంపై ‘బ్యాగు’ భారం

బాల్యంపై ‘బ్యాగు’ భారం

నందిపేట్‌(ఆర్మూర్‌): పసి వయసులోనే చిన్నారులు లేత భుజాలపై బండెడు పుస్తకాలు మోస్తూ కుంగిపోతున్నారు. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు డజన్ల కొద్ది పుస్తకాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. దీంతో పిల్లలు పుస్తకాల బరువు మోయక తప్పడం లేదు. తరగతులు పెరిగే కొద్ది విద్యార్థుల బ్యాగు బరువు సైతం పెరుగుతుంది. సాధారణంగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక పలక, ఒక నోట్‌ పుస్తకం ఉంటాయి. కానీ.. ప్రస్తుతం ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలోనే వారితో 20 పాఠ్య, నోట్‌ పుస్తకాలు మోయిస్తున్నారు. పిల్లల బరువులో పది శాతానికి మించిన బరువు వేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సైతం పుస్తకాల బరువుకు సంబంధించి నిబంధనలు తీసుకొచ్చినా వాటిని అమలు చేస్తున్న దాఖలాలు ఏ పాఠశాలలోనూ కనిపించడం లేదు.

2017లో జీవో జారీ

విద్యార్థుల వీపుపై బండెడు బరువును తగ్గించడానికి 2017లో ప్రభుత్వం 22 జీవోను జారీ చేసింది. ఎన్‌సీఈఆర్టీ ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన పుస్తకాలే ప్రయివేటు పాఠశాలలో వినియోగించాలి. హోంవర్కు పేరిట ట్యూషన్లు, స్పెషల్‌ క్లాసులు నిర్వహించొద్దు. ఆట పాటలతో చదువు సాగించాలి. విద్యార్థులకు వాటర్‌ బాటిల్‌ బరువు లేకుండా పాఠశాలలోనే తాగునీటిని అందించాలి. ఐదో తరగతి వరకు హోంవర్కు ఉండకూడదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయినా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలోని ప్రయివేటు పాఠశాలలో జీవో అమలుకు నోచుకోవడం లేదు.

శారీరక ఎదుగుదలపై ప్రభావం

తరగతుల వారీగా బరువు ఇలా..

తరగతులు బరువు (కిలోల్లో)

1–2 1.5

3–5 2–3

6–7 4

8,9 4.5

10 5

నర్సరీ నుంచే పుస్తకాల మోత

బరువు మోయలేకపోతున్న చిన్నారులు

ప్రయివేటు పాఠశాలల్లో

అమలుకాని జీవో 22

విద్యాశాఖ పర్యవేక్షణ కరువు

విద్యార్థులు అధిక భారం మోస్తున్నందున వారి శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,171 ఉండగా, ప్రయివేటు పాఠశాలలు 475 వరకు ఉన్నాయి. ఒకప్పుడు ఆరు సబ్జెక్టులకు ఆరు నోట్‌బుక్సుతోపాటు ఒక రఫ్‌ నోట్‌బుక్‌ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సబ్జెక్టుకు ఒక రఫ్‌ బుక్‌తోపాటు గైడ్లు, డ్రాయింగ్‌, రికార్డులు, డైరీలు, ఇతర బుక్‌లు కలుపుకొని కిలోల కొద్ది పుస్తకాలను బ్యాగులో మోసుకెళ్లాల్సి వస్తుంది. రోజుకు 10 కోలోల బరువు కంటే ఎక్కువగానే చిన్నారులు తమ భుజాలపై మోస్తూ ఒకటి, రెండు అంతస్తుల భవనాల్లోని తరగతి గదులకు వెళుతున్నారు. దీంతో చాలా మంది పిల్లలు వెన్ను నొప్పి, జాయింట్‌ పెయిన్స్‌ బారినపడుతున్నారు.

చదువుపై శ్రద్ధ పెట్టలేరు..

అధిక బరువు మోస్తున్న కారణంగా పిల్లలు మానసిక ఆందోళన గురవుతారు. త్వరగా అలసిపోయి చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతారు. నడుము, వెన్ను, కండరాల నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. వయసుకు తగిన బరువును మాత్రమే చిన్నారులతో మోయించాలి.

– ప్రవీణ్‌, వైద్యాధికారి, నందిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement