
సిద్ధ సమాధికి కామేశ మహర్షి
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి
శ్రీకామాక్షీ పీఠంలో ముగిసిన అంత్యక్రియలు
అమలాపురం టౌన్: శివైక్యం పొందిన స్థానిక శ్రీ కామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి సిద్ధ సమాధి క్రతువు అదే పీఠంలో శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది. సిద్ధ పురుషులు, స్వామీజీలు, పీఠాధిపతులకు ఏ రకమైన సిద్ధి సమాధి నిర్వహిస్తారో అదే సంప్రదాయంలో కామేశ మహర్షికి నిర్వహించారు. పీఠం ఉత్తరాధికారి విఖనస రాఖీ ప్రేమ్ ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు. పీఠం బ్రహ్మ బ్రహ్మశ్రీ గోవిందవజ్జుల నాగబాబు బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్, కృచ్చాత్రయం, పంచ గ వ్య ప్రాసన వంటి పూజాదికాలు చేశారు. కామేశ మ హర్షి పార్థివ శరీరానికి పంచ వాకములతో 11 రకాల అభిషేకాలు, విరజాహోమాలు, పుష్పార్చన తర్వాత సమాధి స్థల శుద్ధి, భూత బలి నిర్వహించారు. వేద పండితులు పంచ కాటక, పంచ ఉప నిషత్తులు తదితర పూజాదికాలతో సిద్ధి సమాధి నిర్మించి చివరిగా మంగళ హారతితో ఈ క్రతువు ముగిసింది. తమను కన్న వారి కంటే మిన్నగా కంటికి రెప్పలా పెంచుతున్న పీఠంలోని ప్రేమ మందిరం అనాధ పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. చివరగా తమ గురువులు కామేశ మహర్షి పార్ధివ శరీరానికి నమస్కరించి కన్నీటి వీడ్కో లు చెప్పారు. ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి, పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు, కామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ప్రేమ మందిరం పూర్వ ఆశ్రమవాసులైన అనాథలు, పట్టణ ప్రముఖలు తమ గురు వు కామేశ మహర్షికి నివాళులర్పించారు. తమ గురువు సిద్ధ సమాధి ప్రక్రియలో పాల్గొనేందుకు అనేక మంది భక్తులు తరలి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.
– కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్
కరప: కాలానుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ ప్రసాద్ అన్నారు. పెనుగుదురు రైతు సేవాకేంద్రంలో శుక్రవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ, రైతులు పొలంలో మట్టి పరీక్షలు చేయించాలన్నారు. దీనివల్ల సాగులో పెట్టుబడులు తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. పచ్చిరొట్ట పంటలు సాగు చేయడం వల్ల నేల సారవంతమవుతుందన్నారు. కాకినాడ జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ మాధవి మాట్లాడుతూ, పంట కాలువలకు సాగు నీరు విడుదలైందని, రైతులు ముందస్తు ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలన్నారు. అక్టోబరు నెలాఖరుకు పంటచేతికొస్తే, నవంబర్లో తుపాన్ల నుంచి గట్టెక్కవచ్చన్నారు. పెట్టుబడులు తగ్గించుకునేందుకు బెంగాల్ ఊడ్పు, వెదజల్లు పద్ధతులు అనుసరించాలన్నారు. ఖరీఫ్లో మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలని, విత్తన శుద్ధి చేయాలన్నారు. ఎంఏఓ ఏవీ రాజేష్ మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ విధానంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. 80 శాతం రాయితీతో అందిస్తున్న డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలకరి పంటకు స్వర్ణ రకంతో పాటు, ఎంటీయూ–1318 రకాన్ని కూడా సాగు చేసి, అధిక వర్షాలు, ముంపు నుంచి పంటను కాపాడుకోవచ్చన్నారు. పిఠాపురం ఉద్యానవన శాఖాధికారి శైలజ మాట్లాడుతూ, పొలాల గట్లపై, ఇంటి మిద్దెలపై సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ బి.నాగేశ్వర్రెడ్డి, డాక్టర్ ఎస్.రవీంద్ర, ఏఈఓ బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.