పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు

Jun 7 2025 12:18 AM | Updated on Jun 7 2025 12:18 AM

పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు

పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు

బార్లపూడి క్రాంతిపై మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఫైర్‌

పవన్‌ కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కోసం

ఇంత దిగజారి పోవాలా?

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పదవుల కోసం నీ తండ్రి మీద, నీ తమ్ముడుపై ఆరోపణలు చేయడం సరికాదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతికి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి సూచించారు. బార్లపూడి క్రాంతి ఇటీవల తండ్రి ముద్రగడపై, సోదరుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబుపై చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీ శివకుమారి ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కోసం నీవు దిగజారి పోవాలా? అని ప్రశ్నించారు. నీ రాజకీయం కోసం మా నాయకుడు గిరిబాబుపై నిందలు వేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కోసం కొడుకు గిరిబాబు పడుతున్న కష్టాలు రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎన్నికలప్పుడు నీ తండ్రి మీద ఆరోపణలు చేసి పరువు తీసినప్పుడు ఈ ప్రేమ ఏమైందన్నారు. మా నాయకుడు ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉంది. నీ తండ్రి ముద్రగడ పద్మనాభం ‘నా కూతురితో ఇంక సంబంధాలు లేవు, నాకు ఏమి జరిగినా చూడటానికి కూడా రావద్ద’ని ఎన్నికల సమయంలో మీడియా ముఖంగా చెప్పింది నీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. మా నాయకుడు గిరిబాబుపై ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తే త్వరలోనే మరిన్ని ఆధారాలతో నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ముద్రగడపై కక్షతోనే పవన్‌ కల్యాణ్‌ జనసేన నాయకురాలు క్రాంతితో వ్యాఖ్యలు చేయిస్తున్నారా? అనే అనుమానం ఉందన్నారు. క్రాంతిపై పవన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మీ మామయ్య, నీ భర్త ఆరోగ్యం కోసం ట్రీట్‌ మెంట్‌ చేయించుకో అని ఆమెకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement