కాకినాడ రూరల్: కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే మార్గంలో గంగనాపల్లి గ్రామ పరిధిలో కోటిపల్లి రైల్వే లైన్ దాటిన తరువాత కాల్వలో గుర్తు పట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45 నుంచి 50 మధ్య ఉండవచ్చని, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నట్టు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు. సుమారు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో కాల్వ నీటిలో మునిగిపోయి ఉంటాడని, మృతదేహం ఉబ్బిపోయి చర్మం ఊడిపోయి ఉన్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.