
కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్
బాలాజీచెరువు (కాకినాడ): నగరానికి చెందిన దామలంక కరుణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితా ల్లో ఆలిండియా రిజర్వ్ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించింది. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడు తూ, ఐఐటీ ముంబైలో సీఎస్ఈ అభ్యసించాలనేది తన లక్ష్యమని పేర్కొంది. ఆలిండియా రిజర్వ్ కేటగిరీ లో నాలుగో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇంటర్మీడియెట్లో రెగ్యులర్ సిలబస్తో పాటు, ఈ పరీక్షకు సంబంధించి ప్రతిరోజు సమయం కేటాయించి సాధన చేయడం తన విజయానికి కారణమని తెలిపింది. ఆమె తండ్రి సుబ్బారావు వ్యవసా యం చేస్తుండగా, తల్లి మంగాదేవి గృహిణి.