
రేపటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19, 23 విభాగాలకు ఈ సెలక్షన్స్ ఉంటాయన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్లోని పిల్లలమర్రి రోడ్డులోగల ఎండీసీఏ క్రికెట్ మైదానంలో, జడ్చర్లలోని మినీ స్టేడియంలో, 15న నారాయణపేటలోని మినీ స్టేడియంలో, నాగర్కర్నూల్లోని నల్లవెల్లి రోడ్డులోగల క్రికెట్ అకాడమీలో, 16న వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీపీఎల్ మున్సిపల్ గ్రౌండ్లో, గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల సెలక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఎంపికై న క్రీడా జట్లతో ఈ నెల 19 నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లకు శ్రీకారం చుట్టిందని, పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభచాటాలని పిలుపునిచ్చారు. క్రికెట్ సెలక్షన్స్కు సంబంధించి మిగతా వివరాల కోసం మహబూబ్నగర్లో సంతోష్ (81792 75867), నాగర్కర్నూల్లో సతీష్ (89193 86105), జడ్చర్లలో మహేష్ (99494 84723), గద్వాలలో శ్రీనివాసులు (98859 55633), నారాయణపేటలో రమణ (91007 53683), పెబ్బేర్లో శంకర్ (96033 60654) నంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.