
మల్లమ్మకుంటతోనే మేలు..
తుమ్మిళ్ల లిఫ్ట్ నిర్మాణం వల్ల చాలా వరకు నీటి సమస్య తీరింది. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీటిని తోడుకునేందుకు అవకాశం ఉంటుంది. నదిలో నీరు లేని సమయంలో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే వరద ఉన్నప్పుడు రిజర్వాయర్లో నీరు నింపుకోవచ్చు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తేనే మేలు. వేలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది.
– వీరన్న, ఆయకట్టు రైతు, తనగల
రిజర్వాయర్ రద్దు మంచిది కాదు..
మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు.
– సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్,
●

మల్లమ్మకుంటతోనే మేలు..