
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
మొగుళ్లపల్లి: ఇంటర్మీడియట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆద ర్శ పాఠశాలలు ఓ వరంలా మారాయి. మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో మోడల్ స్కూ ళ్లకు ఆదరణ పెరిగింది. 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం అధికా రులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో 6 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేస్తారు. జిల్లాలో మొగుళ్లపల్లి, చిట్యాల, గణపురం, కాటారం, మల్హర్, మహముత్తారం మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ ఇలా..
పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలకు ఎంపిక చే యనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
బాలికలకు హాస్టల్ సౌకర్యం....
ఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వస తి కూడా ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీ డియట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం కల్పించారు.
సద్వినియోగం చేసుకోవాలి
మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా విద్యనిందిస్తుంది. క్రమశిక్షణతో పాటు అనుభవం కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రాకేశ్, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కోర్కిశాల
ఈనెల 20 వరకు ఆన్లైన్లో
దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో 6 ఆదర్శ పాఠశాలలు,
960 సీట్లు

‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు