
కార్మికులంటే అలుసు
చంద్రబాబునాయుడు ఏ రోజూ కార్మికులకు మేలు చేసింది లేదు. కార్మికులంటే ఆయనకు ఎప్పుడూ అలుసే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏడాది గడస్తున్నా.. ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా ఫైన్లు పెరిగిపోవటం, చలనాలు, జరిమానాలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నాం. మా సంక్షేమం కోసం ఏ రోజూ ఆలోచించలేదు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుఏటా రూ.15 వేల ఆర్థిక సాయం, 21, 31 జీవోల రద్దు, పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
– మొగిలి పుల్లారావు (డ్రైవర్)