బంగారు ఆభరణం అప్పగింత
ద్వారకాతిరుమల: స్థానిక యూటీఎఫ్ భవనంలో ఓ పెళ్లి బృందం మరిచిపోయిన బంగారు ఆభరణాన్ని మంగళవారం ఆ కుటుంబానికి అప్పగించారు. యూటీఎఫ్ భవనంలో సోమవారం ఓ వివాహం జరిగింది. వరుడి తరుఫు బంధువులు బంగారు ఆభరణాన్ని గదిలో మరచిపోయి వెళ్లిపోయారు. భవన నిర్వహణను చూసుకుంటున్న వీసం నాగేశ్వరరావు (యూటీఎఫ్ నాగు)కి ఈ ఆభరణం కనిపించింది. దాంతో విషయాన్ని బాధిత కుటుంబానికి తెలియజేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు రవికుమార్, మస్తుఫాలీ, ఎంఈఓలు సత్యనారాయణ, వెంకటరావు బాధిత కుటుంబానికి ఈ ఆభరణాన్ని అందజేశారు. నాగు నిజాయతీని మెచ్చుకుని, అభినందించారు.


