ఇదేం తీరువా బాబూ ! | - | Sakshi
Sakshi News home page

ఇదేం తీరువా బాబూ !

Jul 3 2025 7:39 AM | Updated on Jul 3 2025 4:45 PM

ఇదేం

ఇదేం తీరువా బాబూ !

బాదుడే.. బాదుడు

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025

సాక్షి, భీమవరం: సూపర్‌ సిక్స్‌లోని అన్నదాత సుఖీ భవ సాయం అందించకపోగా రైతులపై భారం మోపడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకానికి ఎసరుపెట్టి ఏడాదికి దాదాపు రూ.28 కోట్ల ప్రీమియంను రైతులపై మోపింది. మరుగున పడిన నీటితీరువాను తాజాగా తెరపైకి తెచ్చి పన్నుల రూపంలో రూ.21.81 కోట్లు రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది. తొలకరికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. సాగునీటి సరఫరాకు గతంలో నీటి తీరువా పేరిట రెవెన్యూ శాఖ రైతుల నుంచి పన్ను వసూలు చేసేది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఈ సొమ్ములు వసూలు చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండటంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ రైతులకు ఊరటనిస్తూ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. వెబ్‌సైట్‌ సిద్ధం కాకపోవడంతో గత మూడేళ్లుగా నీటి తీరువా ఊసేలేకుండా పోయింది.

న్యూస్‌రీల్‌

రైతులపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం

ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎసరు

తాజాగా నీటి తీరువా వసూలుకు ఆదేశం

రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం

నీటి తీరువా వసూలు చేయని గత వైఎస్సార్‌సీపీ సర్కారు

జగన్‌ సర్కారు 2019 ఖరీఫ్‌ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చిన విషయం విదితమే. ఈ క్రాప్‌ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. కూటమి వచ్చాక ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ.205) కాగా, మిగిలిన 1.5 శాతం (రూ.615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై రూ.28 కోట్ల భారం పడుతున్నట్టు అంచనా.

ఇదేం తీరువా బాబూ ! 1
1/1

ఇదేం తీరువా బాబూ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement