రాయకుదురు, నడపనివారిపాలెంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

రాయకుదురు, నడపనివారిపాలెంలో చోరీ

Mar 21 2023 12:50 AM | Updated on Mar 21 2023 12:50 AM

వీరవాసరం: వీరవాసరం మండలంలోని రాయకుదురు, నడపనవారిపాలెంలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. రాయకుదురు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తలుపులు , బీరువాలు పగలగొట్టి వాటిలో ఉన్న 12 ట్యాబ్‌లు దొంగలు పట్టుకుని పోయారు. నడపనివారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనూ భారీ చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న తలుపులను, హుండీని పగలగొట్టారు. వెండి శఠగోపం, ఉద్దరిణి, పంచ పాత్రలు, పళ్లెం వంటి వెండి సామన్లతో పాటు హుండీలోని సుమారు రూ.25 వేల నగదును చోరీ చేశారు. సంఘటనా ప్రాంతాన్ని భీమవరం రూరల్‌ సీఐ సిహెచ్‌ నాగప్రసాద్‌ సందర్శించారు. క్లూస్‌ టీం ప్రత్యేకంగా వివరాలు, వేలిముద్ర నమూనాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement