ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి, 32మందికి గాయాలు

7 Deceased In UP Road Accident  - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిలిబిత్‌, ఖుషీనగర్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిలిభిత్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ జై ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పిలిభిత్‌ డిపో నుంచి లక్నోకు బయలుదేరిన బస్సును బోలెరో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. స్వల్పంగా గాయపడిన 24 మందిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది, బొలెరోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బొలెరో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top