లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

May 22 2024 3:31 PM | Updated on May 22 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 22,622 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 299 పాయింట్లు పుంజుకుని 74,252 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ, మారుతీసుజుకీ, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, నెస్లే, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement